calender_icon.png 24 September, 2024 | 3:26 PM

పాలమూరు ప్రాజెక్టు పనుల పరిశీలనకు మంత్రుల రాక

24-09-2024 01:45:50 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ తదితరులు పరిశీలించనున్నారు. మంత్రులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటన చెందుకు షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉదయం 9 గంటలకి జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్, అనంతరం గట్టు మండలంలోని నల్ల సోమనాద్రి గట్టు రిజర్వాయర్, కొత్తకోటలోని శంకర సముద్రం రిజర్వాయర్, కొల్లాపూర్ మండలం ఎల్లూరు, నార్లాపూర్, బిజినపల్లి మండలం వట్టెం పంపింగ్ స్టేషన్ వద్ద నిర్మాణం అవుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను సందర్శించి అక్కడే సమీక్షించనున్నారు.