హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయ క్రాంతి) : మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు త్వరలో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్లో పర్యటిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు అధికారులు కూడా పర్యటించనున్నారు. సియోల్లో రివర్ఫ్రంట్ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఈ పర్యటనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్, 12 మంది ఎమ్మెల్యేలు, మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్తోపాటు మరో ఆరుగురు అధికారులు వెళ్లనున్నారు.