calender_icon.png 23 September, 2024 | 7:55 PM

గాంధీ భవన్‌కు మంత్రులు.. ప్రజలతో ముఖాముఖి

23-09-2024 05:07:15 PM

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధ, శుక్రవారాల్లో ఒక్క మంత్రి గాంధీభవన్ కు రావాలని మహేష్ గౌడ్ సూచించారు. వారానికి 2 రోజుల పాటు గాంధీభవన్ కు మంత్రులు సందర్శించనున్నారు. బుధ, శుక్రవారాల్లో ఉ. 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రులు ముఖాముఖి నిర్వహించనున్నారు. బుధవారం నుంచే ప్రజలు, కార్యకర్తలతో మంత్రుల ముఖాముఖి ప్రారంభం కానుంది. ఎల్లుండి తొలిరోజు మంత్రి రాజనర్సింహతో ప్రజలు, కార్యకర్తలు ముఖాముఖిలో పాల్గొనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.