03-03-2025 12:18:33 AM
మఠంపల్లి, మార్చి 2 : మఠంపల్లి మండలంలోని కృష్ణ తండాకు చెందిన హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ భూక్య కృష్ణ నాయక్ ఆదివారం రాష్ర్ట పౌరసరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ నాయక్ మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గిరిజనులు ఎల్లప్పుడూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటే ఉంటారని గిరిజన తండాలు అభివృద్ధి పరచటంలో మంత్రి కృషి మరువలేనిదని అన్నారు.