హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి పితృవియోగం కలిగింది. కిమ్స్ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తమ్ రెడ్డి చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు, కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు.