calender_icon.png 11 October, 2024 | 2:56 PM

నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

11-10-2024 12:00:14 PM

హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి పయనం కానున్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు కూడా వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్ అనిల్ జైన్ తో మంత్రి ఉత్తమ్ భేటీ కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఛైర్మన్ తో సమావేశం కానున్నారు. మేడిగడ్డ, అన్నాం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణ చర్యలపై చర్చించనున్నారు. నీటి నిల్వ అవకాశలపై మంత్రి ఉత్తమ్ చర్చించనున్నారు. ఆనకట్టలపై తుది నివేదిక ఇవ్వాలని ఎన్ డీఎస్ ఏను మంత్రి కోరనున్నారు.