హైదరాబాద్: మలేషియాలో అధికారిక పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం మూడో రోజు పర్యటిస్తున్నారు. ఫెల్దా ఛైర్మెన్ తో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. పుత్రజయలో మలేషియా వ్యవసాయ మంత్రితో తుమ్మల భేటీ కానున్నారు. సెలాంగర్ లో ఆయిల్ పామ్ హార్వెస్టింగ్ ఎక్విప్ మెంట్ ఫీల్డ్ పరిశీలించనున్నారు. సాయంత్రం మలేషియా నుంచి మంత్రి తుమ్మల హైదరాబాద్ బయలుదేరనున్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై స్టడీ కోసం తుమ్మల మలేషియా వెళ్లారు.