03-03-2025 03:31:43 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి దుమ్ముగూడెం ఆనకట్టను పరిశీలించారు. నిధుల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వం ఒక రూపాయి పన్నులు చెల్లిస్తే, కేంద్రం నుంచి ప్రతిఫలంగా 42 పైసలు మాత్రమే లభిస్తున్నాయని, అయితే బీహార్ రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయికి ప్రతిఫలంగా రూ.7 పొందుతుందని ఆయన అన్నారు. ఆర్థిక సహాయంలో బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.