calender_icon.png 4 October, 2024 | 6:56 PM

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

04-10-2024 03:11:19 PM

మంథని,(విజయక్రాంతి): మంథని డివిజన్ లో బాధిత  కుటుంబాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్ బాబు శుక్రవారం పరమర్శించారు. మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పద బానయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని, మంథనిలో ఆకుల నాగరాజు మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి, అనంతరం వెంకటాపూర్ లో కుడుదుల వెంకన్న తల్లి మృతిచెందగా వారి కుటుంబాన్ని, రామగిరి మండలంలోని రామయ్యపల్లిలో మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య తండ్రి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, అలాగే లద్నాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ మంథని డివిజన్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ తండ్రి మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ట తిరుపతి యాదవ్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రెండు రమా, కౌన్సిలర్లు, ముత్తారం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం, అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.