కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాని పురస్కరించుకొని రాష్ట్ర ఐటి పతిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం కరీంనగర్ పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణ త్యాగదనులను కొనియాడారు. అంతకుముందు తెలంగాణా అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమెల్ల సత్పతి, సి పి అభిషేక్ మహంతి. మేయర్ సునీల్ రావు, సూడా చైర్మన్ జి వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.