calender_icon.png 12 October, 2024 | 4:41 PM

ప్రజల ఆరోగ్యంపై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి

03-09-2024 11:45:30 AM

మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల ప్రజల ఆరోగ్యంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండలంలోని అన్ని గ్రామాలలో విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వారి గ్రామంలోనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించినట్లు మాజీ జడ్పిటిసి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం తెలిపారు. కేషనపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ... విష జ్వరాలతో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందుతుందని సూచించారు. వైద్య శిబిరాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన డిఆర్డిఓ రవీందర్ తోపాటు మండల వైద్యాధికారి అమరేందర్ రావుతో మాట్లాడారు. జ్వరం వచ్చిన వారిని ప్రత్యేక దృష్టితో చూసి వైద్య పరీక్షలు చేసి నాణ్యమైన మందులు అందించాలని కోరారు. ఎంతో ఓపికతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మండల వైద్యాధికారితో పాటు సిబ్బందికి సదానందం కృతజ్ఞతలు తెలిపారు.