హైదరాబాద్,(విజయక్రాంతి): మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆరోపించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, ఆ ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి మేము అండగా ఉంటూ ఆదుకుంటామని వెల్లడించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని, ప్రజలకు శ్రీధర్ బాబు పేర్కొన్నారు.