06-03-2025 03:41:02 PM
కాంగ్రెస్ ను ఓడించేందుకు రెండు పార్టీలు కలిశాయి
కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ), బీజేబీతో కలిసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీ(Bharatiya Janata Party)తో మమేకమై బీఆర్ఎస్ నడిచిందని మంత్రి విమర్శించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కలిసి పనిచేశాయని మంత్రి పేర్కొన్నారు. పట్టభద్రుల నైపుణ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారని శ్రీధర్ బాబు వెల్లడించారు.