calender_icon.png 24 October, 2024 | 10:00 PM

13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన

09-08-2024 02:06:46 AM

హైదరాబాద్, ఆగస్టు 08 (విజయ క్రాంతి): గ్రామాల్లోని సమస్య లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఈ 13వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల్లోని సంబంధిత శాఖా పరమైన సమస్యలు, గ్రామాల్లోని సమస్యలపై మంత్రి నేరుగా గ్రామస్తులతో మాట్లాడి తెలసుకోనున్నారు. ఉమ్మ డి జిల్లాల వారీగా ఉండే ఈ పర్యటన సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో పెండింగ్ సమస్యలు, పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛదనం వంటి అంశాలతోపాటు శాఖాపరమైన అంశాలపై కూడా సమీక్షించనున్నారు. ఈ పర్యటన ఈనెల 25వ తేదీ వరకు కొనసాగునుంది.