calender_icon.png 3 October, 2024 | 2:45 PM

స్వర్ణ వాగు ముంపుకు గురైన జిఎన్ఆర్ కాలనీని సందర్శించి మంత్రి శ్రీధర్ బాబు

03-09-2024 05:02:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని స్వర్ణ వాగు ముంపుకు గురైన జిఎన్ఆర్ కాలనీని సందర్శించి, అక్కడి బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పునరావాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు ఉన్నారు.