calender_icon.png 30 September, 2024 | 7:01 PM

బీఆర్ఎస్ చేసిన అవినీతి దేశం మొత్తం తెలుసు

30-09-2024 04:29:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి దేశమంతా తెలుసని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ తప్పిదాలు కనుమరుగు చేస్తునందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని సీతక్క విమర్శించారు. మూసీలో ఆక్రమణలతో అందరికీ ఇబ్బందులు వస్తున్నాయని, మూసీ పరివాహకంలో గత పదేళ్లలో ఎన్నో అక్రమ కట్టడాలు వెలిశాయని, అందులో నేతల భవనాలే ఎక్కువున్నాయన్నారు.  బడా నేతలు భవనాలు కట్టి పేదలకు అద్దెకు ఇచ్చారని, సామన్యులకు నష్టం కలగకుండా చూస్తామని, ఇళ్లు కోల్పోతున్న వారికి స్థిరనివాసం కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. చెరువుల మధ్యలో కొందరు భవనాలు నిర్మించారని, మిడ్ మానేరు, మల్లన్నసాగర్ లో ఎంత నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించారో తెలుసన్నారు. ఇప్పుడు హరీశ్ రావు, కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని సీతక్క ఎద్దేవా చేశారు.