హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్వేశ రాజకీయాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని సీతక్క ఆరోపించారు. బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తే.. బీఆర్ఎస్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టార్గెట్ చేసిందని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ బిడ్డల రూపం లేదు.. కేసీఆర్ బిడ్డ రూపమే ఉందన్నారు. తెలంగాణ సగటు మహిళకు ప్రతి రూపంగా ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి సచివాలయంలో ప్రతిష్టిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.