calender_icon.png 23 October, 2024 | 8:31 PM

మంత్రి పొన్నం ప్రభాకర్ సేవలు అభినందనీయం

23-10-2024 07:08:33 PM

కోహెడ,(విజయ క్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్ లో మండల కాంగ్రెస్ పార్టీ శాఖ తరుపున విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య మాట్లాడుతూ... గత 10 నెల్లలో కాంగ్రెస్  పార్టీ అధికారం లో కి వచ్చినప్పటినుండి హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు  చేశారని, మండలంలోని అన్ని గ్రామాల్లోని రోడ్ల నిర్మాణనికి కృషి చేస్తున్నారని చెప్పారు. కోహెడ మండలం నారాయణ పూర్  గ్రామం వర్షం పడితే లంక గ్రామాల పరిస్థితి దారుణంగా వుండేది. ఆ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. అలాగే మండు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా బోర్లు మంజూరు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానెయ్యాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.