calender_icon.png 3 October, 2024 | 6:46 PM

ఎల్ఏండీ లో చేపపిల్లలను విడుదల చేసిన మంత్రి పొన్నం

03-10-2024 03:22:03 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన లోయర్ మానేరు డ్యాంలో 100 శాతం సబ్సిడీతో  చేప పిల్లల విడుదల కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు డ్యాం లో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్  కమిషనర్ ప్రియాంక ఆలా,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మత్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్,కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నేత వెలిచాల రాజేందర్ రావు , కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ ,హుజురాబాద్ ఇన్చార్జి వొడితల ప్రణవ్, కార్పొరేటర్లు ,పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.