హైదరాబాద్: గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి మంత్రి వినతులు స్వీకరిస్తున్నారు. పదేళ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్నిక ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తాము చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, విద్యార్థి, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం 150 మందికి విదేశీ విద్యానిధి ఇచ్చిందని ఆరోపించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందన్నారు.