calender_icon.png 11 October, 2024 | 1:28 PM

ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు భూమి పూజ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

11-10-2024 11:22:56 AM

హుస్నాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగాళ్లపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్  గౌడ్ మాట్లాడుతూ.. జిఓ విడుదల అయ్యాక ఉప ముఖ్యమంత్రితో శంకుస్థాపన చెపిస్తామన్నారు. తంగళ్లపల్లి నుండి బద్దిపడిగా వరకు ఉన్న రహదరిని రెండు లైన్ల రహదారిగా విస్తరిస్తామని అన్నారు. గత 10 సంవత్సరాల్లో విద్య వ్యవస్థ నిర్లక్ష్యం అయినది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.27 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కరెంట్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 10వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని, గురుకులాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామన్నారు. కొత్త అకడమిక్ మొదలు అయ్యేలోగా పాఠశాల నిర్మాణం పూర్తి కావాలని, హుస్నాబాద్ ను వ్యవసాయ పర్యావరణ, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రామూర్తి , కోహెడ తహసిల్దార్ సురేఖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, బండిపెళ్లి నారాయణ,  సోషల్ మీడియా అధ్యక్షుడు అబ్దుల్ రఫీ, పాము శ్రీకాంత్ పులి రాజు నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.