calender_icon.png 10 October, 2024 | 1:51 PM

ప్రతి కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచాలు

10-10-2024 11:27:01 AM

హైదరాబాద్: ప్రభుత్వం ఇచ్చే పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ లో కటమయ్య రక్షణ కవచాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేయాలని కలెక్టర్ కు మంత్రి విజ్ఞప్తి చేశారు.