calender_icon.png 29 September, 2024 | 3:55 PM

ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించన మంత్రి పొన్నం ప్రభాకర్

29-09-2024 01:37:48 PM

కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించన మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్ లని మొదటి విడతగా ప్రారంభిస్తున్నామన్నారు. జెబీఎం సంస్థ తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందన్నారు.

హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్ లను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డిజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్ లు నడిపేలా చూస్తామన్నారు. విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని మెరుగు పరుస్తామని రాష్ట్ర మహా లక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి 3200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారన్నారు. ఆర్టీసీ - ప్రభుత్వం కలిపి త్వరలోనే బస్ ల కొనుగోలు చేస్తామని ఆర్టీసీలో ఉద్యోగులు ,కార్మికులకు పిఆర్సి , కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామన్నారు.