calender_icon.png 9 October, 2024 | 3:00 PM

మాజీ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్

09-10-2024 12:08:24 PM

హైదరాబాద్: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఇళ్లు ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. 2 పడకల ఇళ్లు ఇవ్వడంతో పాటు నిర్వాసితుల పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీ సంక్షేమశాఖ, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వశాఖ ద్వారా కులగణన చేస్తామన్నారు. బుధవారం గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు.