calender_icon.png 10 October, 2024 | 12:42 PM

ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం

10-10-2024 10:52:55 AM

ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..

హైదరాబాద్: వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ద్వారా ఓ కీలక విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో భద్రతా ప్రమాణాలను పాటించండి, రోడ్డు ప్రమాదాల భారిన పడకుండా జాగ్రత్త వహించండి. తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. సగటున దేశం వ్యాప్తంగా సవంత్సరాని లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని వెల్లడించారు. దసరా చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తు అని చెప్పిన పొన్నం ప్రభాకర్ కుటుంబ సభులందరం కలిసి ఈ దసరాకు ఆయుధపూజ చేసే సమయంలో ఒక విజ్ఞప్తి చేద్దామన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందామని ప్రమాణం చేద్దాం అన్నారు. మద్యం తాగి వాహనం నడపరాదని, ఇది ప్రమాదానికి సూచిక అని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.