హైదరాబాద్ ప్రతిష్ఠపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ అసమర్థుడు
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర ప్రతిష్ఠపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. వచ్చే బల్దియా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. కేంద్రమంత్రిగా హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేశారని కిషన్ రెడ్డికి సూటిగా ప్రశ్నించారు. పురపాలక శాఖ మంత్రిగా అసమర్థుడైన కేటీఆర్ హైదరాబాద్ అస్తవ్యస్తమయ్యేందుకు కారణం అన్నారు. బోనాల పండుగ తర్వాత సీఎం బస్తీబాట కార్యక్రమం చేపడుతారని పొన్నం పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు పొన్నం విజ్ఞప్తి చేశారు.