మనవరాలితో ఆడుకున్న మంత్రి పొంగులేటి..
ఖమ్మం (విజయక్రాంతి): హలో మైరా... ఏం చేస్తున్నావ్ రా.... నానిని పిలువు.... అదిగో పిచ్చుక... రమ్మను... రమ్మను అంటూ... తన మనుమరాలతో సరదాగా కాలక్షేపం చేశారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.... నిత్యం బిజీ బిజీగా గడిపే ఆయన అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటన ముగించుకొని సత్తుపల్లి నుంచి వైరా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో తన స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో కాసేపు ఆగారు. అక్కడే ఉన్న తన మనవరాలు మైరాను ఎత్తుకుని ముచ్చట్లు చెప్పారు. ఏం అయింది.. అమ్మ.. అబ్బు అయిందా.... ఊచ్ పోదామా అంటూ పాపతో ఆడుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించారు.