హైదరాబాద్: కాసేపట్లో డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం కానున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ సమావేశం కొనసాగనుంది. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, నూతన రెవెన్యూ చట్టంపై చర్చించనున్నారు. ధరణి పోర్టల్, రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి చర్చించనున్నారు.