హైదరాబాద్: ప్రముఖ సినీనటి సమంతపై వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సమంత ట్వీట్ చూసి నేను చాలా బాధపడ్డానని తెలిపారు. తనకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వేసే పరువు నష్టం దావాను లీగల్గానే ఎదుర్కొంటానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అటు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో మంత్రి కొండా సురేఖకు పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఫోన్ చేవారు. సమంత, నాగచైతన్య వివాదంపై మాట్లాడిన మహేష్గౌడ్ కొండా సురేఖకు వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ సూచించారు.