మెదక్,(విజయక్రాంతి): ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మెదక్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర అటవీశాఖ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలలో పాల్గొనడానికి మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో హెలిపాడు వద్ద ఆదివారం రాత్రి చాప్టర్ ద్వారా మెదక్ చేరుకున్న రాష్ట్ర అటవీశాఖ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అడిషనల్ ఎస్పి మహేందర్ పుష్పగుచ్చము అందజేసి ఘన స్వాగతం పలికారు.