హైదరాబాద్: వరంగల్ జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులను మంత్రి కొండా సురేఖ గురువారం అందజేశారు. నగరంలోని క్యాంపు కార్యలంయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 367 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మీ చెక్కులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అందజేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను తమ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులతో పాటు తులం బంగారం కూడా అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.