calender_icon.png 26 October, 2024 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాకు మంత్రి కోమటిరెడ్డి

06-08-2024 02:42:47 AM

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో కలిసి గురువారం అమెరికాలో ప్రవాస భారతీయ ప్రముఖులతో జరుగనున్న ‘మీట్ అండ్ గ్రీట్’కు హాజరయ్యేందుకు సోమవారం రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బయల్దేరి వెళ్లారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను వేగవంతం చేసేందుకు సైతం మంత్రి ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటారని సమచారం. పనులు పూర్తి చేసేందుకు అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు 12న ఓహియోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈవో లాక్ హోమ్‌తో ఆయన సమావేశమవుతారు.