సంగారెడ్డి అర్బన్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాను తెలంగగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మధూరి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.