calender_icon.png 21 October, 2024 | 5:25 AM

మంత్రి, ఎంపీ ఫొటోలు మార్ఫింగ్

16-10-2024 01:09:27 AM

ఇద్దరి అరెస్ట్ 

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో మంగళవారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. తెలిసిన వివరాల ప్రకారం.. దుబ్బాకలో జరిగిన షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హాజరయ్యారు.

వీరి ఫొటోలను జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన అనుమళ్ల మహేశ్, నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన దేవన్న అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఎంపీ రఘునందన్‌రావు దుబ్బాక పోలీస్‌స్టేషన్‌తో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో నిందితుల కోసం గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు