calender_icon.png 23 October, 2024 | 12:43 PM

మనసులను మెలిపెట్టే పొట్టేల్

19-10-2024 12:00:00 AM

యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పొట్టేల్‘. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నిశాంత్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

1980ల కాలంలో తెలంగాణ సరిహద్దు  మహారాష్ట్రలోని విదర్భకు 30 కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామం లో జరిగిన కథ అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. నాటి తెలంగాణ సమా జంలో ఉన్న ఆచార వ్యవహారాలు, మాతంగి వ్యవస్థ వంటి వాటన్నింటినీ దాటుకుని ఓ తండ్రి తన కూతురికి చదువు చెప్పించేందుకు పడే తపన, ఇబ్బందులే కథాంశమని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మొత్తానికి సినిమా మనసులను మెలిపెట్టే సెంటిమెంటుతో రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తే అవగతమవుతోంది.