నారాయణపేట,(విజయక్రాంతి): మిలాద్-ఉన్-నబి ర్యాలీ శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ... నారాయణపేట జిల్లాలో మిలాద్-ఉన్-నబి పండగ ర్యాలీనీ జిల్లా పరిధిలో శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు.
ముస్లిం కమిటీ సభ్యులు మిలాద్-ఉన్-నబి ర్యాలీని శాంతియుతంగా, సామరస్యంగా నిర్వహించుకోవాలని అందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం, పోలీస్ పికెట్స్ ఏర్పాటు, ప్రధాన చౌరస్తాలలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందరూ శాంతియుతంగా కుల మతాలకతీతంగా పండుగ ర్యాలీని నిర్వహించుకోవాలని సూచించారు.
సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో అనుచిత పోస్టులు పెట్టరాదని ఇతర మతస్తులను కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనిఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాపై, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా పోస్టులు చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు