హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ విజిలెన్స్ కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. మూడేళ్లపాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 1983 ఐఏఎస్ బ్యాచ్ తెలంగాణ విభాగానికి చెందిన ఆయన గతంలో రాష్ట్రంలో పలు హోదాల్లో సేవలందించారు. 2017 ఫిబ్రవరిలో ఆయన రిటైరయ్యారు.