26-03-2025 06:45:51 PM
అందోల్: అందోల్-జోగిపేట పురపాలక సంఘం మెప్మా పరిదిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పిఎంఎఫ్ఎంఈ పథకం క్రింద జోగిపేటకు చెందిన జీనత్ బేగం సభ్యురాలికి రూ.9,44,000/- మంజూరు అయింది. ఇందులో భాగంగా బేకరీ వోవేన్ మెప్మా పథక సంచాలకులు గీత ప్రారంభించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, బ్యాంక్ మేనేజర్ నాగరాజు, మెప్మా టిఎంసి భిక్షపతి గౌడ్, ఆర్పీ అనిత హాజరయ్యారు.