calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడిబాట కరపత్రాలను ఆవిష్కరించిన ఎంఈఓ

18-04-2025 12:00:00 AM

లక్షేట్టిపేట, ఏప్రిల్ 17: మండలం లోని దౌడపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం మండల విద్యాధి కారి హెలెన్ డారతి బడిబాట కపరత్రాలను ఆవిష్కరించారు.  ఈ సంద ర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ..... విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. రాబోయే విద్యా సంవత్సరం లో చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధ ర్, ఉపాధ్యాయులు సతీష్, రాజ కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.