calender_icon.png 3 March, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

03-03-2025 12:08:03 AM

మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

నల్లగొండ, మార్చి 2 (విజయక్రాంతి) : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సాధ్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. దామరచర్ల మండలం గణేశ్‌పహాడ్ గ్రామంలో నిర్మించిన రామాలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ర్ట ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.