calender_icon.png 7 October, 2024 | 6:05 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యత్వ నమోదు కీలకం

07-10-2024 03:08:10 PM

ప్రజలు కాంగ్రెస్ మరియు బి.ఆర్.ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరు - శ్రీరాములు అందెల

మహేశ్వరం, (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బడంగ్ పేట్ గ్రామంలో బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ గారు హాజరై ప్రజల నుండి సభ్యత్వాలను సేకరించారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థ ఎన్నికలకు సభ్యత్వ నమోదు చాలా కీలకమని, ప్రజలు కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని, కావున అన్ని వర్గాల నుండి సభ్యత్వాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి గారు, కార్పొరేషన్ సభ్యత్వ నమోదు కన్వీనర్ నడికుడ యాదగిరి గారు, రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి గారు, బిజెపి సీనియర్ నాయకులు సామ సంజీవరెడ్డి గారు, రేసు నర్సింహారెడ్డి, బెల్దే రాజు, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు చిత్రం శ్రీనివాస్, కందికంటి శ్రీనివాస్ గౌడ్, సాయి సంతోష్, సతీష్ నంద, బంగారు సాహిల్ శరత్ చంద్ర, మల్లేష్, ప్రవీణ్ గౌడ్, మహేందర్, శివ బిజెపి మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.