మందమర్రి (విజయక్రాంతి): పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తుంగపిండి రాజలింగును పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరాజ్, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారులు నక్క తిరుపతి, ఉపాధ్యక్షులు లక్కిరెడ్డి అనిధర్ రెడ్డి, నక్క పవన్, ప్రచార కార్యదర్శి రామసాని సురేందర్, చింతకింది రవి, జాడి ముకుందం, సభ్యులు పాల్గొన్నారు.