calender_icon.png 27 October, 2024 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్స్ వర్సిటీ నిర్మాణానికి మేఘా

27-10-2024 02:03:51 AM

  1. వర్సిటీ నిర్మాణానికి ‘మేఘా’ ముందడుగు
  2. సీఎస్‌ఆర్ నిధుల నుంచి 200 కోట్లు కేటాయింపు
  3. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని ప్రకటన
  4. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
  5. మేఘా కంపెనీని అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) కంపె నీ ముందుకొచ్చింది.

మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆ ర్) నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంప స్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మిం చే బాధ్యతలు స్వీకరించింది.

ప్రపంచస్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిం ది. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది.

సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ సమా వేశంలో పాల్గొన్నారు. 

నవంబర్ 8వ తేదీ నుంచి పనులు ప్రారంభించాలి

సీఎస్‌ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకు వచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్‌షాపులు, తరగతి గదులతోపాటు హాస్టల్ బిల్డింగ్, లేబొరేటరీ బ్లాక్, గ్రంథాలయం, కంప్యూటర్ హబ్, విద్యార్థి, సిబ్బంది వసతి సముదాయాలు, పార్కింగ్, ఫుడ్‌కోర్టు, వివిధ రకాల సౌకర్యాలు, ఏడొందల మంది కూర్చునేందుకు అనువుగా భారీ ఆడిటోరియం, సమావేశ మందిరాలు, భద్రతా, ఇతర సిబ్బంది గృహ సముదాయాలను నిర్మిస్తామని మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు.

ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

భవనాల నిర్మాణానికి ప్రభుత్వంతో ఎంఓయూ..

ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్ వర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మెఘా కంపెనీ చర్చలు జరి పింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్ వర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడుతామని ప్రకటించింది. వర్సిటీ భవ నాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, వర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. హైదరాబాద్ శివారులోని కందుకూరు మం డలం మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టులో భూమి పూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతోపాటు విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయించింది.