హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): గాంధీభవన్లో మంత్రులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నందున ముఖాముఖిని వాయిదా వేసినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపారు. సోమవారం నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ విజ్ఞప్తులు అందించాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది.