calender_icon.png 5 October, 2024 | 1:04 PM

మంత్రులతో ముఖాముఖి సోమవారానికి వాయిదా

05-10-2024 02:23:41 AM

హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): గాంధీభవన్‌లో మంత్రులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నందున ముఖాముఖిని వాయిదా వేసినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపారు. సోమవారం నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ విజ్ఞప్తులు అందించాలని టీపీసీసీ విజ్ఞప్తి చేసింది.