calender_icon.png 24 October, 2024 | 1:59 PM

‘ఇండియన్ రెడ్‌క్రాస్’ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

15-07-2024 02:42:14 AM

నాగోల్, జూలై 14: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగోల్ డివిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ భవనంలో ఆదివారం వృద్ధుల కో సం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బీ పీ, షుగర్ మొదలైన పరీక్షలు నిర్వహించి నె ల రోజులకు సరిపడా మందులు అందజేశా రు. శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా రెడ్‌క్రాస్ చై ర్మన్ ఎస్ నర్సింహా రెడ్డి ప్రారంభించి మా ట్లాడారు. కార్యక్రామంలో రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వీ పాండు గౌడ్, అడ్వయిజర్ డాక్టర్ ఏ శ్రీరాములు, ట్రెజరర్ చల్లా రా ఘవ రెడ్డి, ఎం అశోక్ కుమార్, ఎం నర్సిం హా రెడ్డి, కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.