రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
మేడ్చల్, అక్టోబర్ 7: స్టేషన్ బెయి ల్ కోసం మేడ్చల్ ఏఎస్సై కే మధుసూదన్ రావు రూ.50 వేలు లంచం తీసు కుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి మేడ్చల్ మండలం గౌడవెల్లిలోని సాకే త్ ప్రణామం విల్లాలో శర్మ అనే వ్యక్తి ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ చేయడానికి రూ. 8 లక్షలకు ఒప్పందం చేసుకు న్నాడు.
రూ.4 లక్షలు అడ్వాన్స్ ఇవ్వ గా సగం పనిచేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పనిచేయలేదు. తన ఇల్లుకు విశ్వనాథ్ తాళం వేశాడని శర్మ రెండు నెలల క్రితం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏఎస్సై మధుసూదన్ రావు విచారిస్తున్నాడు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఇటీవల విశ్వనాథ్ వద్ద రూ.10 వేలు తీసుకున్నాడు.
ఆ తర్వా త మొత్తం రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో విశ్వనాథ్ నాంపల్లిలోని ఏసీ బీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సోమవారం పోలీస్ స్టేషన్లో మొదటగా రూ.50 వేలు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచామని డీఎస్పీ వివరించారు. సీఐ కూ డా డబ్బులు డిమాండ్ చేశాడని బాధితుడు తెలిపాడని, ఇన్వెస్టిగేషన్ చేస్తు న్నామని పేర్కొన్నారు.