మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకమని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ప్రెస్ బ్యూరో ఆధ్వర్యంలో వార్తలాప్ మీడియా వర్క్ షాప్ లో పాల్గొని ప్రసంగించారు. ప్రజల్లో మూఢనమ్మకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై, సామాజిక బహిష్కరణలపై చైతన్యం చేయడంలో మీడియా ప్రధాన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.