25-03-2025 12:00:00 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి24 (విజయక్రాంతి): క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి సీతారాం తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ‘నిక్షయ్ పొషన్ యోజన’ కింద వైద్యంతో పాటు తగ్గేవరకు రూ.6000లు ఇవ్వడం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో అజిముద్దిన్, పవన్కుమార్, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఎన్జీవో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.