calender_icon.png 2 February, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల నిషేధం అమలుకు చర్యలు

02-02-2025 12:16:45 AM

నారాయణపేట, ఫిబ్రవరి 0(విజయ క్రాంతి): నారాయణపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధం అమలుకు పగడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు డి.ఎస్.పి నల్లపు  లింగయ్య తెలిపారు. శనివారం  జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పి మాట్లాడారు.

జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కమిటీల నేతత్వంలో  మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.  గతంలో నమోదైన గంజాయి కేసులే తప్ప కొత్త కేసులేమి లేవని ఆయన చెప్పారు.

తమ పోలీసు శాఖ తో పాటు రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఎక్సైజ్ శాఖ, వైద్య శాఖ అధికారులు నిషేధం అమలుకు సమిష్టిగా కషి చేయాలని కోరారు. తమ శాఖ  మాదకద్రవ్యాల నిషేధంపై  క్షేత్రస్థాయిలో నిఘా పెట్టామని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి మాట్లాడుతూ.. పోలీసు శాఖ నిర్వహించే అవగాహన కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఇస్తే  తమ శాఖ తరఫున వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొని  ఆరోగ్య పరంగా సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. 

ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే  టోల్ ఫ్రీ 14416 నంబర్ కు ఫోన్ చేసి తెలుపితే మెడికల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తామని సౌభాగ్య లక్ష్మి తెలిపారు.  మాదకద్రవ్యాల నిషేదిత జిల్లాగా నారాయణపేట ను మార్చాలని, అందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కషి చేయాలనీ. 

ఈ సందర్భంగా  ఆర్డీవో రామచందర్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో మేఘా గాంధీ, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారులు అఖిల ప్రసన్న,  రాణి దేవి, ఎక్సైజ్ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.