calender_icon.png 1 February, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : అదనపు కలెక్టర్

29-01-2025 01:28:52 AM

మేడ్చల్, జనవరి 28(విజయ క్రాంతి): ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ట్రాఫిక్ అదనపు డీసీపీలు, ఏసీపీలు, రవాణా శాఖ, రోడ్లు భవనాల అధికారులు, జిహెచ్‌ఎంసి, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. సమావేశంలో రోడ్డు ప్రమాదాలు, తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో  ప్రమాదాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.